38.2 C
Hyderabad
May 3, 2024 20: 41 PM
Slider ముఖ్యంశాలు

తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలు సహించేది లేదు

#nagati harish

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పక్షాలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఒక సాధారణ జర్నలిస్టు అయిన మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఓర్వలేని స్థితికి పాలకవర్గాలు చేరుకున్నాయని తీన్మార్ మల్లన్న టీమ్ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ నాగటి హరీష్ అన్నారు.

ఆయనపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని నాగటి హరీష్ తీవ్రంగా ఖండించారు. తీన్మార్ మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు.

పరిపాలన చేతకాకపోతే దిగిపోవాలి కానీ ఇలాంటి నీచపు పనులేంటని ఆయన  ప్రశ్నించారు. ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వ పనితీరు మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉండాలని హరీష్ డిమాండ్ చేశారు.

Related posts

40 మంది వరకూ సిట్టింగులకు టిక్కెట్లు గల్లంతు?

Satyam NEWS

దసరాకు టీఎస్ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులు

Bhavani

నిరుపేద మృతుడి దహన సంస్కారాలకు సాయం అందించిన తస్లీమా

Bhavani

Leave a Comment