42.2 C
Hyderabad
May 3, 2024 18: 47 PM
Slider వరంగల్

నిరుపేద మృతుడి దహన సంస్కారాలకు సాయం అందించిన తస్లీమా

నిరుపేద మృతదేహానికి దహన సంస్కారాల కోసం సాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ మానవత్వం చాటుకున్నారు. ములుగు జిల్లా కేంద్రం సపాయి వాడకు చెందిన కొలేపాక రజినీకాంత్ అనారోగ్యంతో మరణించాడు.

మృతుడి భార్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. దీంతో రజినీకాంత్ ఒంటరయ్యాడు. అతడిని పట్టించుకోనే వారు ఎవరు లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించి మరణించాడు. మృతదేహాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులు తస్లీమాను ఆశ్రయించి పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన తస్లీమా వెళ్ళి మృతుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో దహన సంస్కారాల నిమిత్తం సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

Related posts

ప్రాచీన కళలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది

Satyam NEWS

చిన్న పిల్లలు మోటారు వాహనాలు నడిపితే కఠిన చర్యలు

Satyam NEWS

పీఎస్‌లో హిజ్రాల రణరంగం

Bhavani

Leave a Comment