పర్యావరణానికి హాని కలింగించని ఉత్పత్తులను సమాజానికి అందించేలా నూతన ఆవిష్కరణలకు ప్రాముఖ్యత ఇవ్వాలని నేషనల్ జాట్ బోర్డు డిప్యుటి డైరెక్టర్ బి. నర్సింహులు అన్నారు. గురువారం సాయంత్రం కాప్రా జిల్లా పరిషత్ స్కూల్లో మహిళా పారిశ్రామికవేత్త, దేవి జూట్ ప్రొడక్ట్స్ అధినేత G. దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దేవి జూట్ ప్రొడక్ట్స్ వారు ఆడించిన పర్యావరణ హిత నార సంచులను 800 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజు, నేతలు బద్రుద్దిన్, మెచ్చ పాండు, కుమార్, శ్రీకాంత్ గౌడ్, ఉపాద్యాయులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా
previous post