అన్నపూర్ణ కాలనీలో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్ట నున్నామని జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ త్వరలోనే అన్నపూర్ణ కాలనీలోని పాడైన మిగతా అన్ని రోడ్లలో కొత్త సిమెంటు రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. గొల్ల ముత్యాలు భాయ్ భూగర్భ డ్రైనేజీలోకి అన్నపూర్ణ కాలనీ డ్రైనేజీ లైన్లు కలపడం జరిగిందన్నారు. అలాగే అన్ని మ్యాన్ హోల్లలో సిల్ట్ తొలగించి క్లియర్ చేయించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేకర్ ,విఠల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, బిక్షపతి యాదవ్, నరసింహ, కైలాష్, పాండు, సాయిలు, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
previous post