37.2 C
Hyderabad
May 6, 2024 11: 16 AM
Slider ఖమ్మం

అమరవీరుల కుటుంబ సభ్యులకు అండ గా వుంటాం

#palonchapolice

20 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా పరిధిలో వున్న ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ మావోయిస్టుల దాడిలో మరణించిన బండి హరినాద్  కుటుంబ సభ్యులను పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ పరామర్శించారు. ప్రస్తుతం పాల్వంచ పట్టణ పరిధిలోని బొల్లోరుగూడెంలో నివాసముంటున్న బండి హరినాద్ సతీమణి రాజ్యలక్ష్మి, కుమారుడు అమృత్ సాయినాద్, కుమార్తె తేజస్వి లను పరామర్శించారు. అనంతరం హరినాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఎస్పీ  మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమను సంప్రదించవచ్చని అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే ప్రస్తుతం సమాజంలో మనం ప్రశాంతంగా జీవిస్తున్నామని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ నాగరాజు,ఎస్సై నరేష్ మరియు సిబ్బంది పాల్గోన్నారు.

Related posts

జయ జయ సాయి ట్రస్ట్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

దూదిమెట్ల బాలరాజు కు కొల్లాపూర్ యాదవ సంఘం అభినందనలు

Satyam NEWS

విజయన‌గ‌రంలో మ‌రోసారి ప్ర‌తాపం చూపించిన ఖాకీలు…!

Satyam NEWS

Leave a Comment