20 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా పరిధిలో వున్న ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ మావోయిస్టుల దాడిలో మరణించిన బండి హరినాద్ కుటుంబ సభ్యులను పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ పరామర్శించారు. ప్రస్తుతం పాల్వంచ పట్టణ పరిధిలోని బొల్లోరుగూడెంలో నివాసముంటున్న బండి హరినాద్ సతీమణి రాజ్యలక్ష్మి, కుమారుడు అమృత్ సాయినాద్, కుమార్తె తేజస్వి లను పరామర్శించారు. అనంతరం హరినాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తమను సంప్రదించవచ్చని అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే ప్రస్తుతం సమాజంలో మనం ప్రశాంతంగా జీవిస్తున్నామని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ నాగరాజు,ఎస్సై నరేష్ మరియు సిబ్బంది పాల్గోన్నారు.
previous post
next post