తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను పలువురు అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా యాదవ సంఘం యువ నాయుకులు ఆయనను అభినందించిన వారిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బాలరాజు యాదవ్ కు పదవి దక్కడం సంతోషదాయకమని వారు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉద్యమాల ముద్దుబిడ్డ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అని వారు అన్నారు. తెలంగాణ సాధనలో తన వంతు పాత్ర వహించిన ఉద్యమ నాయకుడికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పదవి ఇవ్వడం హర్షణీయమని తెలిపారు. బాలరాజు యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలియజేసిన వారిలో గంగం మల్లేష్ యాదవ్ ఎంపిల్ రీసెర్చ్ స్కాలర్, యాపట్ల మల్లేష్ యాదవ్, ముద్రకోళ్ళ శంకర్ యాదవ్, జంగం మల్లేష్ యాదవ్, జంగం కృష్ణ యాదవ్, శవ్వ మహేష్ యాదవ్, వడ్లకొండ రాజు యాదవ్ తదితరులు ఉన్నారు.