37.2 C
Hyderabad
April 26, 2024 21: 34 PM
Slider గుంటూరు

జయ జయ సాయి ట్రస్ట్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ

#jayajayasai

గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం, జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 2022 వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి అవిష్కరించారు. అనంతరం రాజమండ్రి మున్సిపల్  ఇంజనీరింగ్ అధికారి బ్రహ్మశ్రీ  కాశీ వెంకటేస్వరావు గారి తండ్రి కీర్తి శేషులు బ్రహ్మశ్రీ హరనాథరావు గారి జ్ఞాపకార్థం పేదలకు అన్న సంతర్ప జరిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమత దళ్ అధ్యక్షుడు వంజ ముత్తయ్య, రాష్ట్ర జనక్రాంతి పార్టీ అధ్యక్ష్యుడు గౌస్, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు మానేపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, ట్రస్ట్ ఆధ్వర్యములో గత 11 సంవత్సరాలుగా అన్నదానం చేయడం సంతోషమని, పేదల ఆకలితీర్చడం భగవంతుడు ఇచ్చిన సేవ అని, అది దాతల సహకారంతో నిర్వహించడం సంతోషం అని వచ్చిన ప్రముఖులు తెలియ చేశారు.

Related posts

కార్యకర్తల బలమే నా బలం: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

ఒంటరినయ్యాను… కన్నీరు ఆగనంటోంది…..

Satyam NEWS

విజయనగరం  జిల్లా అదనపు ఎస్పీగా అస్మా ఫర్హీన్

Satyam NEWS

Leave a Comment