ఆసరా పింఛన్లు ఇస్తూ వృద్ధులను సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా ఆదుకొంటున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని దుబ్బకాల్వ గ్రామంలో వృద్ధులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు స్పందిస్తూ తాను బతికి ఉన్నంత కాలం సీఎం కేసీఆర్కే ఓటేస్తా తమకు కేసీఆర్ జీవగంజి పోస్తున్నడు. ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నాడు అని ఆమె పేర్కొన్నది. కొరటికల్ గ్రామంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ పథకాలను వివరించారు. ఈ క్రమంలో ఓ వృద్ధ స్వాతంత్ర్య సమర యోధుడిని ఆప్యాయంగా పలుకరించారు. తాను సీపిఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు తనయుడినని ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి ని అంటూ ఆ వృద్ధుడుతో మంత్రి అజయ్ సంభాషించారు. రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్కు మద్దుతుగా తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
previous post