ఎవరెన్ని మాయ, మోసపు మాటలు మాట్లాడినా వైరా తో సహా ఖమ్మం జిల్లాలోని అన్ని సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెల్చుకోబోతుందని వైరా నియోజకవర్గ ఇంచార్జి , బీఆర్ఎస్లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జరిగిన వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎన్నికల సమన్వయ కమిటీల సమావేశంలో నామ మాట్లాడారు. అందరం సమిష్టిగా కదలి మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.
చిన్న చిన్న విషయాలు పక్కకు పెట్టి, అంతా సమన్వయం, ఐకమైత్యంగా ముందుకు కదులుదామని అన్నారు. పటిష్టమైన నాయకత్వం, బలముందని, రాత్రీమ్భవళ్లు కష్టించి సీరియస్ గా పనిచేస్తే మదన్ లాల్ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ళు జరిగిన అభివృద్ధిని ఇంటింటికి తీసికెళ్లి విస్తృత ప్రచారం చేయాలని పేర్కొన్నారు. బ్రహ్మాండంగా తెచ్చి న మ్యానిఫెస్టో ను విశదీకరించాలన్నారు. వైరాలో మంచి మెజార్టీ తెచ్చుకుంటేనే మనందరి గౌరవం నిలబడుతుందన్నారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం అయ్యేది కేసీఆరేనని అన్నారు. సమన్వయ , బూత్ కమిటీలు రూట్ మ్యాపు లు సిద్ధం చేసుకొని ఎన్నికల కురుక్షేత్రం లోకి దూసుకుపోవాలన్నారు.వైరా గెలిచి, సీఎం కేసీఆర్ కు కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే రాములు నాయక్, అభ్యర్థి మదన్ లాల్ అన్నారు. ఇంకా ఈ సమావేశంలో రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెట్పీటీసీ లు, పార్టీ ముఖ్య నాయకులు, సమన్వయ, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.