తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఏన్కూరు మండలానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా సక్రు నాయక్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పూర్ణకంటి మైసారావు, చింతనబోయిన సీతారాములు, బిసి సెల్ మండల అధ్యక్షులు దేశిని గణేష్, ధరావత్ నరేష్, బూరుగడ్డ రామారావు, సాయికుమార్, కాకాటి యోహాన్, ఆడపా అవినాష్ తదితరులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి పొంగులేటి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, వైరా నియోజకవర్గ నాయకురాలు బాణోత్ విజయబాయి, గిద్దగిరి సత్యనారాయణ, ముక్తి వెంకటేశ్వర్లు, నల్లమల శివకుమార్, కర్ణం ప్రసాద్, ఇండ్ల కృష్ణయ్య, శోభన్ నాయక్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా ఖమ్మం నగరంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్స్ కు చెందిన పలువురు మహిళలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.