తూర్పు మధ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనం ఏర్పడనున్నట్లు విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి అల్పపీడనం బలపడనున్నది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తీరం వెంబడి 30 కిలో మీటర్ల నుండి 40 వరకు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్యకారులు వేటకు వెళ్లద్దాని వాతావరణం శాఖ అధికారులు సూచన చేశారు. అదే విధంగా కోస్తా, రాయల సీమ లో పిడుగులు పడే అవకాశం కూడా ఉంది.