దేశంలోనే అత్యంత వేగంగా విస్తరించిన బంగారు ఆభరణాల షోరూం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలు కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ మళ్లీ తెరచుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో షోరూంలు తెరవాలని నిర్ణయం తీసుకున్న మలబార్ గోల్డ్ వినియోగదారుల రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది.
షోరూం ల తలుపులు, కుర్చీలు, స్వాపింగ్ మిషన్లు లాంటి అన్ని వస్తువులను నిరంతరంగా శానిటైజ్ చేస్తుంటామని యాజమాన్యం ప్రకటించింది. భౌతిక దూరం పాటిస్తూ షోరూంల సిబ్బంది ఉంటారు. వినియోగదారుల మధ్య కూడా భౌతిక దూరం ఉండే విధంగా ప్లాన్ చేశారు.
షోరూంలో సిబ్బంది నిరంతరం మాస్కులు ధరించే ఉంటారని కూడా యాజమాన్యం తెలిపింది. హాండ్ శానిటైర్లు అందుబాటులో ఉంచుతారు. వినియోగదారులు షోరూంలో ప్రవేశించే సమయంలోనే ధర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. వినియోగదారుడు ట్రయల్ చేసిన అనంతరం ప్రతి ఆభరణాన్ని మరల మరలా శానిటైజ్ చేస్తారు.
వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మలబార్ గోల్డ్ చైర్మన్ ఎం ఏ అహ్మద్ తెలిపారు. వినియోగదారులు ఆన్ లైన్ లో కూడా ఆభరణాలు కొనుగోలు చేయడానికి www.malabargoldanddiamonds.com వెబ్ సైట్ కూడా అందుబాటులో ఉంది.