జీహెచ్ఎంసీ ముఖ్య అధికారులతో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నేడు అత్యవసర సమావేశం నిర్వహించారు. అంబర్ పేట నియోజకవర్గం లోని గోల్నాకా క్యాంప్ ఆఫీస్ లో ఈ సమావేశం జరిగింది. అంబర్ పేట లోని రోడ్లు, నీటి పైప్ లైన్ల మరమ్మత్తులు, కొత్త లైన్స్, రోడ్లు నిర్మాణ కార్యక్రమం తదితర అంశాలపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతా ప్రమాణాల ప్రకారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటుగా మోయిన్ చెరువు స్మశాన వాటిక గురించి సమావేశం లో చర్చించారు. పనులు అతి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.