మధ్యప్రదేశ్ నుంచి బెంగాల్ వరకూ ఉలరితల ద్రోణి నెలకొంది. తూర్పు తీరాన పడమర దిశగా తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి.
ఇవి మరో మూడునాలుగు రోజులు కొనసాగవచ్చునని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్ర తెలిపింది. దీని ప్రభావంతో రేపటి వరకూ తీర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి.
ఆ తర్వాత వర్ష ఉధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈనెల మూడున కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయి.
దక్షిణ తమిళనాడు తీరంలో ఏర్పడుతున్న తుపాను ఆవర్తనం వల్ల కూడా దక్షిణాది రాష్ట్రాలలో రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడి, వాతావరణం చల్లబడుతుంది.