సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలకు అందించి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు వినుకొండ పట్టణంలోని, బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం లో జరిగిన వినుకొండ నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. అందరం కలిసి జగన్ మోహన్ రెడ్డి ని మరోసారి సీఎం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కేన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.