42.2 C
Hyderabad
April 26, 2024 15: 05 PM
Slider ముఖ్యంశాలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు

#nagarkurnool

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్  గోయల్ ఆదేశించారు. బుధవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహించారు.  9 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో వచ్చినందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయాలని కలెక్టర్లను సూచించారు.

నవంబర్ 16 న 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందన్నారు. కరోనా నేపథ్యంలో  భారత ఎన్నికల సంఘం ప్రతిపాదించిన కోవిడ్ నియమాలను పాటించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని,  దీనికి సంబంధించి  కార్యచరణ  రూపొందించాలని   రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్  సంబంధిత అధికారులను ఆదేశించారు.   

నవంబర్ 16 నుండి నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని, డిసెంబర్ 10న పోలింగ్ మరియు డిసెంబర్ 14న కౌంటింగ్ నిర్వహించడం  జరుగుతుందని  తెలిపారు.    స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు  సంబంధించి ఆదిలాబాద్,  కరీంనగర్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్,  రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల  కలెక్టర్లు  రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని, వీరు మిగిలిన   కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా  ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. 

అమలులోకి రానున్న ఎన్నికల నియమావళి

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి 9 జిల్లాల  పరిధిలో  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో  ఓటర్లుగా  ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు.   పోలింగ్  నిర్వహణకు అనువైన  కేంద్రాలను  గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు.

జిల్లా స్థాయిలో  రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి  పోలింగ్ కేంద్రాల జాబితా ఫైనల్ చేసి పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల  కలెక్టర్లు  జిల్లాల వారిగా   ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్  రిటర్నింగ్ అధికారుల జాబితా పంపాలని  సూచించారు.  ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ తో నిర్వహిస్తామని, బ్యాలెట్ బాక్సులను  సిద్దం చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో  హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో పకడ్బందీగా  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని అన్నారు.   కరోనా నేపథ్యంలో  ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల  కమిషన్  మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సమయంలోను అమలు చేయాలని   తెలిపారు.   భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఉదయం 10 నుంచి   రాత్రీ 10 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని,  అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలకు 500 కంటే అధికంగా ప్రజలు  హజరుకావద్దని,  బైక్ ర్యాలీ,  కార్ల ర్యాలీలకు అనుమతి ఉండదని, ఇంటి ఇంటి క్యాంపేన్ 5 మంది, వీడియో వ్యాన్ క్యాంపెన్ 50 మంది, 72 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలని  అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో నియమాలను పాటిస్తు  రాజకీయ పార్టీలు,  అభ్యర్థులు ప్రచారం చేసుకునే విధంగా  వారికి ముందస్తుగా అనుమతులు జరీ చేసేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ,పి ఉదయ్ కుమార్,జిల్లా ఎస్పీ డాక్టర్. సాయి శేఖర్, అదనంగా కలెక్టర్లు మను చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ  శ్రీనివాస్, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

భారీగా విమానాలను కొననున్న ఎయిర్ ఇండియా

Murali Krishna

మార్చి 14 నుండి తిరుమలలో ఫాల్గుణ మాస ఉత్స‌వాలు

Satyam NEWS

గైడ్ లైన్స్: ఎరువు కొన్నవారికి బిల్లు ఇవ్వడం తప్పని సరి

Satyam NEWS

Leave a Comment