ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని అర్హులందరికి అందేలా చొరవ తీసుకుంటున్నట్లు అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. గోల్నాక డివిజన్ లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు ఆయన కార్డులు అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట తహసీల్దార్ సిహెచ్ లలిత, ఆర్.ఐ.మహేష్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట