చట్టాన్నీ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు అప్రజాస్వామికంగా మాట్లాడడం దారుణం మని జనసేన నాయకుడు శెట్టిబత్తుల రాజబాబు అన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారన్న స్పృహ లేకుండా అసభ్య పదజాలంతో కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
మీ మాటలకు సభ్య సమాజం సిగ్గుపడుతోంది అంటూ ఆయన చంద్రశేఖర్ రెడ్డి ని ఉద్దేశించి అన్నారు. బహిరంగ ప్రదేశంలో ఇంత అసభ్య పదజాలంతో మాట్లాడినందుకు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని శెట్టిబత్తుల రాజబాబు డిమాండ్ చేశారు.