ఆకలినో, ఆకతాయితనమో ..లడ్డూపై ఇష్టమోగాని కొంత మంది విద్యార్థులు వినాయక లడ్డూను చోరీ చేసి తినేశారు. చార్మినార్ పీఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో 21 కిలోల లడ్డూను విద్యార్థులు ఎత్తుకెళ్లారు. పాఠశాల నుంచి తిరిగి వెలుతూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేశారట. ఈ వ్యవహారంలో స్థానికంగా చర్చనీయాంశమైంది.
వినాయక నవరాత్రి మండపాల్లో తొమ్మిదిరోజుల పూజలందుకునే లడ్డూలకు భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో వాటిని వేలం వేసి నిర్వాహకులు ఖర్చులను రాబట్టుకోవడం కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో మండపాల నిర్వాహకులు వినాయక లడ్డూల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. అయినా ఘాన్సీ బజార్ మండపంలో లడ్డూ పోవడం విస్మయం రేపింది.