తాగివచ్చి తనను కొట్టడమే కాకుండా తన కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్న భర్తను ఒక మహిళ కొట్టి చంపింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం లోని అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఈ దారుణ హత్య జరిగింది.
భార్య సత్య నారాయణమ్మ తన భర్త ఇసుకపట్ల రామకృష్ణ (34) ను చెంబుతో అతి దారుణంగా కొట్టి చంపేసింది. రోజూ తాగొచ్చి తనను కొట్టడంతో పాటుగా, కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో విసుగుచెందిన భార్య చెంబుతో కొట్టడంతో చనిపోయాడని ఆమె చెబుతున్నది. నిందితురాలు సత్యనారాయణమ్మను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.