గిరిజనులు ,ఆదివాసీల హక్కుల కోసం రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఏపీ రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ గా తాను పని చేస్తానని ఆ కమీషన్ చైర్మన్ డా.డీవీజీ శంకరరావు తెలిపారు. గత నెల 28 ఏపీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గా బాధ్యత లు చేపట్టిన ఆయన విజయనగరం జేడ్పీ గెస్ట్ హౌస్ లో మీడియా తో మాట్లాడారు.2021 ఎస్సీ, ఎస్టీ కమీషన్… రెండు గా వేరై…ప్రత్యేకంగా రాష్ట్ర ఎస్టీ కమీషన్ గా ఏర్పడిందని…మొదటి చైర్మన్ రవిబాబు.. పదవి ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం..
నన్ను నియమించిందని అన్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన నేను.. రాజ్యాంగ బద్ధంగా…. గిరిజనుల హక్కులు కోసం… ఆదివాసీల అభివృద్ధి కోసం… ప్రభుత్వ పథకాలు… సంక్షేమ చర్యలు పై సమీక్షిస్తూ ఉంటానని చెప్పారు. ఈ క్రమంలో… రాష్ట్ర వ్యాప్తంగా… చట్ట బద్దంగా ఏ ప్రభుత్వ పథకం అయినా ఎస్టీలకు అందకపోయినా…గిరిజనులను తొక్కేసిన..
నా దృష్టికి తీసుకురావొచ్చునని చైర్మన్ డా.శంకర్రావు తెలిపారు. అలాగే జిల్లా కొండ ప్రాంతాల్లో… గిరిజనులు అభివృద్ధి కి…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, నిధులు పై సమీక్షలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నానని…ఈ కమీషన్… ఒ సింగల్ కోర్ట్ గా పరగణింపబడుతుందని..రాష్ట్ర ఎస్టీ కమీషన్ చైర్మన్ డా డీ.వీ.జీ.శంకరరావు అన్నారు.