23.7 C
Hyderabad
May 8, 2024 06: 52 AM
Slider శ్రీకాకుళం

విజయనగరం దిశ పీఎస్ లో ఏపీ మహిళా కమీషన్

#disapolicestation

విజయనగరం జిల్లా కేంద్రం లో సీఎం జగన్ అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో ఇష్టం గా..అమ్మాయిల కు భద్రత గా చట్టం గా రూపొందించబడిన “దిశ” పేరు తో 2020లో ఆయన స్వహస్తాల చేతుల మీదుగా ప్రారంభింఐబడిన “దిశ’ పోలీసు స్టేషన్ ను రాష్ట్ర మహిళ కమీషన్ సభ్యురాలు ఉమ ఆకస్మికంగా సందర్శించారు.

ఆమెతో పాటు రాష్ట్ర బాలల సంరక్షణ కమీషన్ అధ్యక్షుడు కేసలి అప్పారావు కూడా సందర్శించారు. సరిగ్గా మధ్యాహ్నం 02 గంటల ప్రాంతంలో ఎండమండిపోతున్న సమయంలో దిశ పోలీసు స్టేషన్ ను సందర్శించారు.సరాసరి నేరుగా డీఎస్పీ ఛాంబర్ లో కి వెళ్లి… ముందు గా దిశ డీఎస్పీ వేంకటేశ్వరులతో అలాగే సీఐ శేషుతో మహిళా కమీషన్ సభ్యురాలు ఉమ…ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇటీవల విజయనగరం జిల్లా గుర్ల లో ఓ అయిదేళ్ల బాలికను..ఓ వ్యక్తి చేసిన ఘటనను సూమోటాగ మహిళా కమీషన్ తీసుకోవడం.. తో ఆ కేసు పూర్వపరాలను చర్చించేందుకై…అటు మహిళా కమీషన్ ఇటు బాలల హక్కుల సంఘం…దిశ పీఎస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా స్టేషన్ లో..అటు బాలికల పట్ల…ఇటు నిందితులను ఏ విధంగా చూస్తారో ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా మహిళా కమీషన్ సభ్యురాలు ఉమ…మాట్లాడుతూ… గుర్ల ఘటన తీవ్రంగా కలిచి వేసిందని… ప్రభుత్వం నిందితుడు కి ఫోక్సో చట్టం కింద శిక్ష పడేలా చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దిశ పీఎస్ మహిళా సిబ్బంది ఉన్నారు.

Related posts

విమానాల మరమత్తు కేంద్రం ఏర్పాటుకు కెనెడా ఏవియేషన్ కంపెనీ

Bhavani

‘దేశం’లో రోజా మనుషులకు ఇక కష్టకాలం

Satyam NEWS

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Satyam NEWS

Leave a Comment