సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కల్లూరు లో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ నిధులు రూ. 3.40 కోట్లతో నిర్మిస్తున్న మినీ స్టేడియం పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ మిగులు పనుల్లో వేగం పెంచి వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. వుడెన్, బాస్కెట్ బాల్ కోర్టులు, ఓపెన్ జిమ్, కబాడ్డి మ్యాట్స్, వాకింగ్ ట్రాక్ పనులు పూర్తిచేయాల్సి వుందన్నారు. పనులు పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, క్రీడాకారులకు అందుబాటులో తేవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పరంధామ రెడ్డి, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, పీఆర్ డిఇ రాంబాబు, కల్లూరు మండల ఎంపిడిఓ రవికుమార్, తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, అధికారులు తదితరులు ఉన్నారు.
previous post