34.7 C
Hyderabad
May 5, 2024 01: 29 AM
Slider ఆంధ్రప్రదేశ్

ట్రాజెడీ: పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిన తల్లి

#Bandar Canal

కుటుంబ కలహాల కారణంగా ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా మరణించేందుకు ప్రయత్నించింది. అయితే అదృష్టం అనాలో దురదృష్టం అనాలో తెలియడం లేదు కానీ ఆమె మరణించి ఇద్దరు పిల్లలు బతికారు. విజయవాడ లోని కృష్ణ లంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.

మృతురాలు పశ్చిమ గోవారి జిల్లా తణుకు మండలం మోర్తా గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నేటి తెల్లవారు జామను ఈ సంఘలన జరిగింది. ఆ మహిళ కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా బందరు కాల్వలో దూకింది.

అది చూసిన పోలీసులు తక్షణమే సహాయం కోసం వెళ్లి ఇద్దరు పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే ఆ మహిళ మాత్రం మరణించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

Development agenda :నిజంగా కమల్ హసన్ లోకనాయకుడే

Satyam NEWS

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

కరోనా బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం సత్యాగ్రహ దీక్ష

Satyam NEWS

Leave a Comment