మనం మనం కోసం అభివృద్ది చెందాలని ఆ తర్వాతే మనల్ని నమ్ముకున్నవారికి చేయూత నివ్వాలని ఏపీలోని విజయనగరం జిల్లా మహిళా పోలీస్ బాస్.. ఎస్పీ దీపిక అన్నారు. అంతర్జాతీయ మహిళా ధినోత్సవం సందర్బంగా విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగిన మహిళ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు.మహిళలకు సంబందించి నాలుగు ముఖ్యమైన అంశాలను ఎస్పీ దీపిక ఉటంకించారు. ప్రతీ కుటుంబంలో మగపిల్లాడికే ప్రాధాన్యత ఇస్తున్నారని…అలా ఇవ్వకూడదని…అమ్మాయికి కూడా అవకాశం ఇవ్వాలన్నారు.నీకు నువ్వు ఏమవుతావు..ఎవ్వరిమీద ఆధార పడకుండా..మన పిల్లలను అందునా ఆడపిల్లలను ఎదగనివ్వాలని…వారి అభిరుచికి అనుగుణంగా ప్రతీ అమ్మ,నాన్నలు నడుచుకోవాలన్నారు. అప్పుడే పమానత్వంతో కూడిన ఈసమాజం అభివృద్ది చెందతుని ఎస్పీ అన్నారు. తాను యూపీఎస్సీ పరీక్షలలో కూడా ఈ రకమైన విబేధాన్ని చూసానని ఎస్పీ గుర్తు చేసారు.