42.2 C
Hyderabad
April 30, 2024 16: 43 PM
Slider నల్గొండ

నిరుపేద కుటుంబాలకు జనచైతన్య ట్రస్ట్ బియ్యం పంపిణీ

#janachitanya

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 15వ,వార్డు వయసు ముత్యాలమ్మ గుడి పక్క సందులో గుడిసె వేసుకొని నివాసం ఉంటున్న కుంభం కోటయ్య,వీరమ్మ కుటుంబానికి,13వ,వార్డు అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న కస్తాల పెంటమ్మ అనే వృద్దురాలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న జన చైతన్య ట్రస్ట్ సభ్యులు శనివారం రెండు కుటుంబాల వారికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం అందజేశారు.

కారింగుల కాశీ తన కూతురు సాయిశరణ్య పుట్టినరోజు సందర్బంగా జనచైతన్య ట్రస్ట్ ను సంప్రదించి 50 కేజీల బియ్యం జనచైతన్య ట్రస్ట్ కి అందివ్వగా వాటిని నిరుపేద కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ కారింగుల కాశీ ని ఆదర్శంగా తీసుకొని పేద కుంటుంబానికి సాయం చేయాలని,పిల్లల పుట్టినరోజు,పెళ్లిరోజులను మధుర జ్ఞాపకంగా నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ పినపారాళ్ల వంశీ,అధ్యక్షుడు పారా సాయి, ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్,ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి రమేష్,దగ్గుపాటి బాబురావు,అహ్మద్,నాగిరెడ్డి,సాయి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

పేదలను ఆదుకునే దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

నరసరావుపేటలో ఘనంగా సూపర్ సండే వేడుకలు

Satyam NEWS

Demand: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

Satyam NEWS

Leave a Comment