ఏప్రిల్ 9వ తేదీన వైయస్ షర్మిల ఆధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో జరగనున్న సంకల్ప సభకు మేళ్ళచెరువు మండలం నుండి వేలాదిగా వైఎస్ఆర్ అభిమానులు తరలిరావాలని పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలోని రామాలయం దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం వైఎస్ షర్మిల సంకల్ప సభ పోస్టర్ ను శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చిన రైతు బాంధవుడని, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పంపిణీ చేసిన పేదల పక్షపాతని, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ లు అందించి రాష్ట్రం లోని ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్నవ్యక్తి రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు.
,ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసిన ఆరోగ్య ప్రదాతగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్ షర్మిలమ్మ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనే ధ్యేయంగా మన ముందుకు వస్తున్న షర్మిలను ఆశీర్వదించి ఖమ్మంలో జరగబోయే సంకల్ప సభను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేళ్ళచెరువు మండల వైఎస్ఆర్ అభిమానులు, కందుల నరసింహారెడ్డి, శాగం రెడ్డి కోటిరెడ్డి,పాశం గోవర్ధన్ రెడ్డి,వీరం రెడ్డి,నరసింహా రెడ్డి, బాలనార్సింహ,రామంజి రెడ్డి, వేడిపాల నాగిరెడ్డి,బండి రవీందర్ రెడ్డి,ముడెం వెంకట్ రెడ్డి, జెనిగ లింగయ్య,బారెడ్డి రాజశేఖర్ రెడ్డి,కర్నాటి వీరారెడ్డి,శివ, వాకంటి తదితరులు పాల్గొన్నారు.