సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాని బుధవారం ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,జోనల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటీవ్ కమిటీ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి వారిని సన్మానించి వినతి పత్రం అందజేశారు.
అనంతరం యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ గత ఆగస్టు నెలలో జరిగిన జోనల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటీవ్ కమిటీ 73వ,మీటింగ్ లో ప్రస్తావించిన విషయాలను జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ రైలును నల్లగొండ,నడికుడి స్టేషన్లలో ఆపుటకు బోర్డుకు పంపినట్లు తెలిపారు.
నల్గొండ పార్లమెంటు సభ్యుడు,మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రస్తావించిన విషయాలలో ముఖ్యమైన విష్ణుపురం నుండి జగ్గయ్యపేట వరకు ప్యాసింజర్ రైలు నడుపుటకు గాను కావలసిన సదుపాయాలు కూడా బోర్డుకు పంపినట్లు జనరల్ మేనేజర్ తెలిపారని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్