39.2 C
Hyderabad
April 28, 2024 11: 27 AM
Slider హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలకే అప్పగించాలి

States SC

ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే చేసుకునే విధంగా పార్లమెంటులో చట్టం తేవాలని టి.ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 26న హైదరాబాద్ నగరంలోని చిల్లీస్ రెస్టారెంట్ హోటల్ లో నిర్వహిస్తామ‌న్నారు.

టి ఎమ్మార్పీఎస్ ఐదవ ఆవిర్భావ దినోత్సవానికి గ్రామ స్థాయి నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, వీటిని అరికట్టడానికి ప్రత్యేక చట్టాలు తేవాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రవణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పాతకోట్లరమేష్ నియోజకవర్గ ఇన్చార్జి కత్తి ఉపేందర్, పట్టణ అధ్యక్షులు కస్తాల జాషువా, మండల అధ్యక్షులు బొడ్డు మల్సూరు, యడవెల్లి రాములు, సూరారపు నాగయ్య, ములకలపల్లి శ్రీను, బొల్లే శీను, ఒగ్గు రవి, పోలే పాక ప్రవీణ్, పంతం లింగయ్య, కొంగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గో మాత ను రక్షిoచుకోవడం మన హక్కు, మన బాధ్యత

Satyam NEWS

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు

Satyam NEWS

అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు

Satyam NEWS

Leave a Comment