అన్నమయ్య జిల్లా రాజంపేట మండ లం కొత్త బోయిన పల్లె అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో శనివారం వైసీపీ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులులు పాల్గొన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎమ్మెల్యే మేడా మల్లి కార్జున రెడ్డి,జడ్పీ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి,రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ గిరీషా,జిల్లా ఎస్పీ రెడ్డి గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ జాబ్ మేళా కు నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాను నిర్వహించి నట్టు వెల్లడించారు.ఈ జాబ్ మేళా కు 80 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు