38.2 C
Hyderabad
May 2, 2024 21: 16 PM
Slider కరీంనగర్

ఛీటింగ్: సెకండ్ క్యాడర్ పై ఈటల ఆగ్రహం

9877_Etela-Rajender

హుజురాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో  మంత్రి ఈటల సెకండ్ క్యాడర్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా తన పలుకుబడిని ఉపయోగించుకునే నాయకులు తనకే మోసం చేశారంటే సామాన్య కార్యకర్తలకు వీరు ఏ విధంగా న్యాయం చేస్తారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో సుదరు నాయకుల మోహాల్లో నెత్తురు చుక్క లేకుండా పోయిందని కార్యకర్తలు గుసాగుసలాడుతున్నారు.

హుజురాబాద్ లో తనకున్న3600 గజాల భూమిని ఎంత రేటు అని అడిగితే సదరు నాయకులు(ఈటల ముఖ్య అనుచరులు) 7వేలు చెపితే నిత్యం తన వెంటే తిరుగుతున్న మరో నాయకుడు అంతే రేటు ఉందని చెప్పాడని, తీరా ఆదే భూమిని 12 వేల చొప్పున అమ్ముకున్నారని ఆయన తెలుపుతూ నిత్యం తన వెంట వుంటూ తన పేరు చెప్పుకుని బతికే నాయకులే తనను మోసం చేస్తే ఇక ఎవరిని నమ్మాలో, ఎవరిని  నమ్మకూడదో అర్థం కావడం లేదని, త్వరలో వీరి లాంటి వారిని గుర్తించి అసలైన కార్యకర్తలకు పార్టీలో పెద్ద పీట వెయ్యడం జరుగుతుందని  ఆయన తెలిపినట్లు కార్యకర్తలు బాహాటంగా చెబుతున్నారు.

Related posts

సదర్ వేడుకలు షురూ

Sub Editor

19న మెదక్, 20 న సూర్యాపేట

Satyam NEWS

ఓబీసీ కోటా సమాన పునర్విభజన మరింత ఆలశ్యం

Satyam NEWS

Leave a Comment