38.2 C
Hyderabad
May 3, 2024 22: 28 PM
Slider శ్రీకాకుళం

ఎన్నికల కోసం మద్యం స్మగ్లింగ్ చేస్తున్న వైసిపినేత కొడుకు

liquir smugling

మద్యం డబ్బు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని చట్టం చేశారు కదా ఆంధ్రప్రదేశ్ లో అలానే జరుగుతున్నదని అనుకోవద్దు సుమా. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం లో అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకు స్వయంగా మద్యం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మెలియపుట్టి రోడ్ లో ఆబ్కారీ పోలీస్ నిఘా లో ఇతను దొరికిపోయాడు.

పరిపాటి కృష్ణం రాజు అనే ఇతను మెలియాపుట్టి మండలం లో కానిస్టేబుల్  విధులు నిర్వహిస్తున్నాడు. అతనే స్వయంగా మద్యం అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతామని ఎక్సయిజ్ సూపరిటెండెంట్ భార్గవ  చెప్పారు. ఇంతకూ పరిపాటి కృష్ణం రాజు ఎవరూ అంటే సంతబొమ్మాలి మండలం వైస్సార్సీపీ నేత కుమారుడు. అతని వద్ద పర్లాకిమిడి నుండి తెస్తున్న 459 మద్యం సీసాలను పట్టుకున్నారు.

Related posts

డ్రగ్స్ మాఫియా ను ప్రశ్నిస్తే తెలుగుదేశం పై దాడి చేస్తున్నారు

Satyam NEWS

రైతు బాంధవుడు, రైతుల పక్షపాతి కేసీఆర్

Satyam NEWS

పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్‌ అకాలీదళ్‌ రచ్చ

Sub Editor

Leave a Comment