40.2 C
Hyderabad
May 5, 2024 18: 15 PM
Slider వరంగల్

14 ఇయర్స్ గర్ల్ మిస్సింగ్: అమ్మో అలానా ఏం జరిగింది?

girl missing

14 ఏళ్ల ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఆశ్రమ పాఠశాల నుంచి మాయం అయింది. ఈ విషయం తెలియగానే ఆశ్రమ పాఠశాల అధికారుల గుండె గుభిల్లుమంది. కేసు తమ మీదకు వస్తుందని వారు చిగురుటాకుల్లా వణికిపోయారు. ఏం జరిగిందో ఏమో తెలియలేదు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది.

దాంతో వారు లబోదిబో మంటూ ఆశ్రమ పాఠశాలకు వచ్చారు. తమ కూతురు ఏమైందో చెప్పాలని వారు అడుగుతున్నారు. ఎవరికి ఏం చేయాలో ఎవరికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. చివరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ తమ కుమార్తె తప్పిపోయిందని ఫిర్యాదు ఇచ్చారు.

ఇదంతా జరిగింది ఎక్కడంటే వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలో. రుద్రగుడెం లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో కోడిశెలకుంట కు చెందిన అంజలి అనే 14 సంవత్సరాల అమ్మాయి చదువుకుంటున్నది. పాఠశాలకు వెళతానని చెప్పి ఇంట్లోనుంచి బయటకు వెళ్లింది.

అంతే తిరిగి రాలేదు. ఏమైందోనని ఆందోళన చెందుతూ నల్లబెల్లి పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. పోలీసులకు కంగారు పుట్టింది. జరగరానికి ఏదైనా జరిగితే తమకు చెడ్డపేరు వస్తుందని. పాపం అందరూ కలిసి గాలింపు మొదలు పెట్టారు. అకస్మాత్తుగా ఒక ఫోటో వచ్చి చేరింది వారికి.

7వ తేదీన అదృశ్యమైన బాలిక వాస్తవానికి అదృశ్యం కాలేదు. మరో మైనర్ బాలుడితో కలిసి లేచిపోయింది. దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే మైనర్ బాలుడిని వివాహం చేసేసుకుని కాపురం పెట్టింది.

అదీ సంగతి. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా ఆ అమ్మాయి అందరికి చెప్పేసింది. ఇంకేముంది కథ కంచికి అంజలి అత్తారింటికి.

Related posts

మూగజీవాల దప్పిక తీరుస్తున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీ

Bhavani

నారా భువనేశ్వరికి టీసీఎల్ సంస్థ ప్రతినిధుల సంఘీభావం

Satyam NEWS

Leave a Comment