కడప జిల్లా చిట్వేలి మండలం నాగవరం గ్రామంలో అకేపాటి విక్రమ్ రెడ్డి,రజినీ కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి స్థానిక శాసన సభ్యులు,ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనువాసులు పాల్గొన్నారు.
అనంతరం గ్రామంలో క్రిమి సంహారక మందు ద్రావణాలను పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ కన్వీనర్ పోలా శ్రీనువాసులు రెడ్డి, డి.సి.యం.యస్. చైర్మన్ దండు గోపి,రైల్వే కోడూరు నాయకులు,ధ్వజ రెడ్డి,చెవ్వు శ్రీనువాసులు రెడ్డి,రమణ రెడ్డి,సాయి కిషోర్ రెడ్డి,రాజంపేట నాయకులు పోలి మురళి రెడ్డి,పోలా సాయి వైభవ్,సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.