లేఖ ఫోర్జరీ కాదు. అది తాను రాసిందే అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మాజీ కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ బహిరంగంగా ప్రతికాప్రకటన విడుదల చేసినా వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మాత్రం వదల్లేదు. రమేష్ కుమార్ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే తన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని విజయసాయి రెడ్డి మూడు ప్రశ్నలు సంధించారు. 1.కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖ పై సంతకం ఆయనే చేశారా లేదా? 2.కేంద్ర హోం శాఖ కు ఏ ఐపి అడ్రస్ నుంచి పంపించారు? 3.ఆ లేఖను ఎవరు రూపొందించారు? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం రాకపోతే మా డీజీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
previous post