స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాజంపేట వైసీపీ నేతలలో, స్థానిక ఎమ్మెల్యే తో భేటి అయ్యారు. రాజంపేట మేడా వైసీపీ కార్యాలయంలో శనివారం రాత్రి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్థానిక ఎలక్షన్ల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మేడా వేంకట మల్లిఖార్జున రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాధరెడ్డి తో భేటి అయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపధ్యంలో ఆయన జిల్లాలో పర్యటించారు. రైల్వే కోడూరు లో నాయకులతో ఎన్నికల్లో గెలుపు పై దిశానిర్దేశం చేసిన ఆయన, రాజంపేట లో కూడా ఎన్నికల గురించి పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. వారితోకొద్దీ సేపు మంతనాలు జరిపి అనంతరం వెళ్లిపోయారు.