వినాయక చవితి హిందువుల తొలి పండగని…అలాంటి హిందువుల పండగకు కరోనా పేరు తో అవరోధాలు పెట్టడం సరైన చర్య కాదన్నారు ..కేంద్ర మాజీ మంత్రి ,టీడీపీ పోలిట్ బ్యూరో నేత అశోక్ గజపతిరాజు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రం లోని సిటీ స్టాండ్ వద్ద ఉన్న గణేష్ కోవెల ను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు కేంద్ర మాజీ మంత్రి చే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయట ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి అశోక్ గజపతిరాజు పూల దండ వేసారు. ఈ సందర్భంగా ఆశోక్. .మీడియా తో మాట్లాడుతూ… శ్రీకృష్ణుడు అంతటి వారికే కష్టాలు తప్పలేదని ఆయనే జైల్లో జన్మించారని అశోక్ తెలిపారు.
హిందువుల పండగైన వినాయక చవతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు మరెన్నో అవరోధాలు పెట్టినా..సంప్రదాయపు పండగలను ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మీ జీ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, విజ్జపు ప్రసాద్ తదితరులు ఉన్నారు.