సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ ఎస్ రాజశేఖర్ రెడ్డి పదకొండవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఇందిరా సెంటర్ లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఐటీ సెల్ ఉపాధ్యక్షుడు సుంకరి శివరాం యాదవ్ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఆరోగ్యశ్రీ, 108 ,104, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేసి, అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అమలు పరిచి తెలుగు ప్రజల హృదయాలలో దేవుడిగా నిలిచారని, రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కొరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తారని అన్నారు.
మాటతప్పని,మడమ తిప్పని, అపజయం అంటూ ఎరుగని, ప్రజల కష్టాలు తెలిసిన రాజశేఖర్ రెడ్డి అందరికీ ఆదర్శం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు కుక్కడపు మహేష్, ముశం సత్యనారాయణ, బెల్లంకొండ గురవయ్య, మేళ్లచెరువు ముక్కంటి, ఇంటిమల్ల బెంజిమెన్, లచ్చిమళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇంకా, కోల మట్టయ్య, కంకణాల పుల్లయ్య, దొంతగాని జగన్, సులవ చంద్రసేన్, జింజిరాల సైదులు, సుదర్శన్, వెలిదండ వీరారెడ్డి, గంజి చంద్రమౌళి, ఉద్దండు, రజాక్ బాబా, ఆనంద్, వెంకటేశ్వర్లు, దాసరి పుల్లయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.