కడప జిల్లా లో తెలంగాణ మద్యాన్ని ఫుల్లు డిమాండ్ ఉంది. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.
వీరపనాయుని పల్లే మండలం లో యర్రగుంట్ల రూరల్ సి.ఐ, వి న్ పల్లి యస్ ఐ, వారి సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు జరుపుతుండగా ఆటోలో అక్రమంగా తెలంగాణ రాష్ట్రం నుండి మద్యం తీసుకువచ్చి అమ్ముతున్న ముఠా పట్టుపడింది.
తెలంగాణ మద్యం వీరపునాయునిపల్లె, ప్రొద్దుటూరు ప్రాంతంలో ఈ ముఠా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు.
ఇలా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి నుండి 214 లిక్కర్ బాటిల్ లు, 700/- రుపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఒక ఆటో సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ కి పంపారు.