29.7 C
Hyderabad
May 3, 2024 03: 38 AM
Slider ఖమ్మం

మరపురాని మనిషి వైయస్ఆర్

#Telangana Congress

సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషం, సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడ్డ వైయస్ఆర్ ని మరవలేమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మరపురాని మనిషిగా యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని పురస్కరించకుని ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో, ఖానాపురంలో జరిగిన వేడుకల్లో పొంగులేటి పాల్గొన్నారు. వైయస్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైయస్ఆర్ ముఖ్యమంత్రి హెూదాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. ఆ పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. అదే తరహా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇప్పుడు కూడా అందాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, కార్పొరేటర్ లు దొడ్డా నగేష్ యాదవ్, మలీదు జగన్, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతగాని జైపాల్, మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, ఎంపీపీ గోసుమధు, షేక్ ఇమామ్, బోడా శ్రావణ్ కుమార్, కీసర పద్మజా రెడ్డి, కొంగర జ్యోతిర్మయి, బాణాల లక్ష్మణ్, ఉపేందర్, రాధాకృష్ణ, చల్లా రామకృష్ణ రెడ్డి, వెనిగళ్ల నాగేశ్వరరావు, కలకోట శ్రీకాంత్, యువనేత గోపి తదితరులు ఉన్నారు.

Related posts

సంతోషం ఫిలిం అవార్డ్స్ లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ

Bhavani

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

Satyam NEWS

ప్రజలను నేరుగా కలవాలని నిర్ణయించిన సిఎం జగన్

Satyam NEWS

Leave a Comment