34.7 C
Hyderabad
May 4, 2024 23: 57 PM
Slider గుంటూరు

యువ‌గ‌ళం పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

#yuvagalam

తెలుగుదేశం యువ‌తేజం నారా లోకేష్ చేప‌ట్ట‌బోయే యువ‌గ‌ళం పాద‌యాత్ర పోస్ట‌ర్ టీడీపీ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. న‌ర‌స‌రావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వ‌ర్యంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్య‌క్షులు జి.వి ఆంజ‌నేయులు స‌మ‌క్షంలో బుధ‌వారం పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.యువ‌నేత లోకేష్ యువ‌గ‌ళం పేరుతో 4000 కిలోమీట‌ర్లు,400 రోజుల‌పాటు చేయ‌బోయే పాద‌యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.రాష్ట్రం బాగుప‌డాలంటే బాబు రావాల‌ని,తెలుగుదేశం ప్ర‌భుత్వం రావాలంటే అంతా క‌లిసిక‌ట్టుగా ఇదే ఉత్సాహంతో ప‌ని చేయాల‌ని డా౹౹అర‌వింద బాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి,రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ దాసరి రాజా మాస్టర్,పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్,తెలుగు యువత నాయకులు కుమ్మేత కోటి రెడ్డి,శాఖమురి మారుతి,పోనుగోటి శ్రీనివాస్ రావు,కూరపాటి హనుమంతరావు,నాగూర్,కొంగర రమేష్,తెలుగు యువత,టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

పార్ట్ టైం టీచర్లను సీఆర్ టిలుగా రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS

ఎరువుల్లేక అల్లాడుతున్న రైతాంగం

Satyam NEWS

ప్రపంచ ఆర్కిటెక్చర్ అవార్డు గెలుచుకున్న GMR

Satyam NEWS

Leave a Comment