27.7 C
Hyderabad
May 11, 2024 08: 46 AM
Slider ఆంధ్రప్రదేశ్

అమరావతిలోనే రాజధాని ఉంటుందని భరోసా

kishan reddy

అమరావతికి చెందిన రైతులు నేడు హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో నివాసం ఉంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని వారు కలిసి అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు వారు వినతి పత్రాన్ని కిషన్ రెడ్డికి సమర్పించారు.

అమరావతి కోసం తాము ఎన్నో త్యాగాలు చేశామని, ఉన్న భూమిని ఇచ్చేశామని ఇప్పుడు అక్కడ నుంచి రాజధానిని తరలిస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెప్పారు. కిషన్ రెడ్డి వారి సమస్యను సానుభూతితో విన్నారు. అమరావతి నుంచి రాజధాని ఎక్కడికి పోదని వారిని భరోసా ఇచ్చారు.

Related posts

హిందూ దేవాలయం వద్దే అన్యమత ప్రచారం…

Satyam NEWS

మాచినేనిపల్లి నర్సరీని సందర్శించిన కొల్లాపూర్ ఫారెస్టు రేంజ్ అధికారి

Satyam NEWS

నిరాధారమైన వార్తలు రాసినందుకు విలేకరి అరెస్టు

Satyam NEWS

Leave a Comment