23.7 C
Hyderabad
May 8, 2024 05: 37 AM
Slider విజయనగరం

హిందూ దేవాలయం వద్దే అన్యమత ప్రచారం…

#temple

విజయనగరం లో వెంకన్న సాక్షిగా మత మార్పిడి..?

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుప్రసిద్ధ దేవాలయాల వద్ద అన్న మత ప్రచారం జరుగుతున్న ఘటనలు కోకొల్లలు. కొన్నాళ్ల కిందట…చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రామతీర్థం బోడి కొండపై ఉన్న రాములోరి విగ్ర శిరస్సు ఖండన ఉదంతం జరిగితే ఆ తర్వాత అంతర్వేది దేవాలయం లో మరో అపచారం… తాజాగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో… సుమారు యాభై ఏళ్ళ క్రితం వెలిసిన ఏడుకొండల దేవాలయం వద్దే అన్యమత ప్రచారం జరగడం కలకలం రేగింది. నగరంలో ని బాలాజీ నగర్ లో శ్రీ వేంకటేశ్వర దేవాలయం వద్దే దాదాపు 20 మంది మహిళలు, పదిమంది పురుషులు.. అలాగే ఆటోలో చిన్నపిల్లలతో మైక్ లో క్రైస్తవ ప్రచారం చేయడం… నగర వాసులను కలవరానికి గురి చేసింది. కనీసం పోలీసులు అనుమతి లేకుండా… అలాగే బాలాజీ నగర్ వాసుల అనుమతి పొందకుండా… అన్యమత ప్రచారం చేయడం..”సత్యం న్యూస్. నెట్.” కెమెరాకు చిక్కింది. తీరా ఆరా తీస్తే… తప్పయ్యింది….వెళ్లిపోతాము..పోలీసులకు ఫిర్యాదు చేయకండి అని “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి తో చెప్పి అక్కడ నుంచీ జారుకున్నారు. ఏదైనా జగన్ ప్రభుత్వ హయాంలో… హిందువులకు తెలియకుండా నే చాలా చోట్ల చాపకింద నీరు లా అన్యమత ప్రచారం జరుగుతోందన్నది…”సత్యం న్యూస్. నెట్.”….నొక్కి చెబుతోంది.

Related posts

భవన నిర్మాణం సంక్షేమ మండలి పాలకమండలిని నియమించాలి

Satyam NEWS

మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

స్వామీ చిన్మయానందా? ఎంత పని చేశావయా?

Satyam NEWS

Leave a Comment