అమెరికాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సాఫ్ట్వేర్ చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చరితారెడ్డి మృతదేహాన్ని నేరేడ్మెట్ రేణుకానగర్లోని నివాసానికి తరలించారు. డిసెంబర్ 27న స్నేహితులతో కలిసి చరితారెడ్డి కారులో వెళ్లారు.
అమెరికాలోని మిచిగావ్ ముస్కేగాన్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో వెనుకసీటులో కూర్చున్న చరితారెడ్డి బ్రెయిన్రెడ్డి అయి మృతిచెందారు.