36.2 C
Hyderabad
May 8, 2024 17: 35 PM
Slider కరీంనగర్

ట్రాజెడీ: అలగనూరు బ్రిడ్జిపై కారుబోల్తా పడి ఒకరి మృతి

accedent

హైదరాబాద్ కరీంనగర్ హైవే పై కొద్ది సేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. మరింత విషాదం ఏమిటంటే ఆ ప్రమాదంలో మృతులను కాపాడే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసు కానిస్టేబుల్ ప్రమాదవశాత్తూ రోడ్డు పై నుంచి జారి కాల్వలో పడ్డాడు.

కొద్ది సేపటి కిందట జరిగిన ఈ రెండు విషాద ఘటనలలో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కారు ఎక్కువ స్పీడ్ లో వెళుతుండగా అలగనూరు బ్రిడ్జి వద్ద రోడ్డు పై నుంచి కింద కాల్వలో పడింది. కారులో ఉన్న ఒకరు మరణించారు. మరో ఇద్దరిని కారు అద్దాలు బద్దలు కొట్టి బయటకు తీస్తున్నారు. ఈ లోపు పైనుంచి కానిస్టేబుల్ జారి కాల్వలో పడ్డాడు.

అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వంతెనపై నుంచి కారును పరిశీలిస్తున్న క్రమంలో కిందపడి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ శంకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌ వాసిగా గుర్తించారు. బాధితులు కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో హైదరాబాద్‌-కరీంనగర్‌ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.

Related posts

రఘురామ ఆట మొదలైంది: ఇక నెక్స్ట్ ఎవరో….???

Satyam NEWS

రాయలసీమ లవ్ స్టోరీ ట్రయిలర్ విడుదల

Satyam NEWS

సమాజ్ వాదీ పార్టీలో కీలక నేతగా శివపాల్ యాదవ్

Bhavani

Leave a Comment