కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. అంటే ఈ మహమ్మారి సోకి 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, బ్రెజిల్ వంటి మధ్య లేదా అధిక ఆదాయ దేశాలు ప్రపంచ జనాభాలో ఎనిమిదో వంతు వాటాను కలిగి ఉన్నాయి.
అయితే అమెరికాలోనే దాదాపు 7,40,000 మరణాలు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది మిగతా దేశాల కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ తర్వాత COVID-19 ఇప్పుడు మరణాలకు మూడో ప్రధాన కారణంగా ఉంది.