40.2 C
Hyderabad
May 2, 2024 17: 29 PM
Slider విశాఖపట్నం

దేశంలో రక్షణ కరవైన మహిళలు

anakapally

దేశంలో మహిళల మీద జరుగుతున్న అకృత్యాలను పూర్తిగా అరికట్టే కఠినమైన చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అనకాపల్లి జనసేన పార్టీ డిమాండ్ చేసింది. సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల అత్యాచారాలలో మృతి చెందిన మహిళలకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం దేశం ప్రధాన భాగమైన మహిళలకు రక్షణ పూర్తిగా కరువైందని తద్వారా దేశ ప్రతిష్ఠకే ముప్పు కలుగుతుందని అన్నారు, అత్యాచార నిందితులను వెంటనే ఉరి తీసే చట్టాలు వస్తేకానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, పరుచూరి యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు

Bhavani

ఎమ్మెల్యే గూడెం కొడుకు మృతి

Bhavani

విలేజ్ గాడ్: వైభవంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

Leave a Comment