నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆచారాల ప్రకారం ఆయన కు పూజారులు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెన్న బాలకోటి రెడ్డి, బండారుపల్లి విశ్వేశ్వరరావు, మక్కెన ఆంజనేయులు, దాసరి పుల్లయ్య, వాసిరెడ్డి రవి తదితర గ్రామ పార్టీ నాయకులు ఉన్నారు.