మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంగారెడ్డి రెండవ అడిషనల్ డిస్టిక్ స్పెషన్ కోర్టు నేడు తీర్పు చెప్పింది.
2018 ఏప్రిల్ 3న మిరుదొడ్డి మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 7 సంవత్సరాల బాలిక ఇంటి వద్ద ఉండగా 23 సంవత్సరాల పెద్దలింగన్నగారి శేఖర్ అత్యాచారం చేశాడు.
ఇంటిలో ఎవరిది లేనిది చూసి, చాక్లెట్ ఇస్తానని బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లి బలవంతం చేసినట్లు రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.
అప్పటి మిరుదొడ్డి ఎస్ఐ భాస్కర్ కేసు నమోదు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి కేసు పరిశోధన ప్రారంభించి నేరస్థుని అరెస్టు చేశారు.
సంగారెడ్డి రెండవ అడిషనల్ డిస్ట్రిక్ట్ స్పెషన్ కోర్టు జడ్జి జే మైత్రేయి ఇరువురి వాదనలు విన్న తర్వాత, ఈరోజు నేరస్థుని కి 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, 1,000/- వేల రూపాయల జరిమానా విధించారు.
నేరస్థునికి జైలు శిక్ష పడడానికి సంగారెడ్డి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ మహబూబ్ అలీ, తన వాదనలు వినిపించారు.
సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్, మర్కుక్ ఎస్ఐ భాస్కర్. కోర్టు లైజనింగ్ అధికారి ఏఎస్ఐ సత్యనారాయణ, కోర్టు కానిస్టేబుల్ రవిరాజ్ సహకరించారు.
ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులను, కోర్టు లైజనింగ్, కోర్టు కానిస్టేబుళ్లను సిపి అభినందించారని త్వరలో వారికి రివార్డ్ అందజేస్తారని దుబ్బాక సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.