29.7 C
Hyderabad
May 4, 2024 05: 32 AM
Slider ఆదిలాబాద్

నాగోబా ఆలయాన్ని సందర్శించిన బండారు దత్తాత్రేయ

#NagobaJatara

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్​  నాగోబా ఆలయాన్ని హిమచల్​ప్రదేశ్​  రాష్ట్ర గవర్నర్  బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు. 

ప్రత్యేక హెలిక్యాప్టర్​లో  ఆదిలాబాద్​ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు ఎంపీ సోయం బాపూరావు ,  జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​, ఎస్పీ విష్ణు ఎస్​.వారియర్​లు  పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. 

అక్కడి నుంచి  రోడ్డు మార్గం గుండా కేస్లాపూర్​ నాగోబా ఆలయానికి చేరుకున్న దత్తన్నకు  మేస్రం వంశీయులు,  దేవాదాయశాఖ ఆఫీసర్లు  ఆదివాసీ సంప్రదాయబద్దంగా తలపాగా చుట్టి స్వాగతం చెప్పారు.  

రాష్ట్ర  దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డితో కలిసి  దత్తాత్రేయ నాగోబకు ప్రత్యేక పూజలు చేసారు. 

అనంతరం ఆయన్ను మేస్రం వంశీయులు  శాలువతో సత్కరించడంతో పాటు నాగోబా ఫోటో, ప్రసాదాన్ని అందజేసారు. 

కరోనా మహామ్మారీపై విజయం సాధిస్తున్న ఈ తరుణంలో  అభివృద్ది మరింత వేగంగా జరుగాలని ,   రైతులు,  మహిళలు, యువకులు ఆరోగ్యంగా ఉండాలని  ఆ భగవంతున్ని కోరినట్లుగా  ఆయన పేర్కొన్నారు.  

1982లో  తొలిసారి  నాగోబాను దర్శించుకోవడం జరిగిందని తిరిగి ఇన్నాళ్లకు గవర్నర్​గా  నాగోబాను దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. 

ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​, ఐటీడీఏ పీఓ భవేష్​ మిశ్రా  తదితరులు ఉన్నారు.

Related posts

కామారెడ్డి లో యువకుడి దారుణ హత్య

Satyam NEWS

మంత్రి కొడాలి నానికి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక

Satyam NEWS

ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్న సమంత

Bhavani

Leave a Comment